Thursday, May 2, 2024

ఘనంగా మంచినీటి పండుగ- పాల్గొన్న ఎమ్మెల్యే.. కలెక్టర్

గణపురం(ప్రభ న్యూస్) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగర్ లోని డబ్ల్యూటీపి వద్ద ఆధ్వర్యంలో ఆర్ డబ్లూఎస్ శాఖ ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఘనంగా మంచినీటి పండుగను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ డబ్లూఎస్ ఈ ఈ నిర్మల ప్రగతి నివేదిక చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, అదనపు కలెక్టర్ దివాకర, వరంగల్ రూరల్ చైర్మన్ గండ్ర జ్యోతి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మాదం మమత సుధాకర్ , ఆర్ డబ్లూఎస్ అధికారులు, జిల్లాలోని అన్ని శాఖల అధికారులు , ప్రజాప్రతినిధులు, నాయకులు, సిబ్బంది , ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement