Tuesday, May 14, 2024

Hyderabad: ఖైరతాబాద్ మహాగణపతికి తొలిపూజ చేసిన గవర్నర్ తమిళిసై

వినాయక చ‌వితి సందర్భంగా హైదరాబాద్ లోని ఖైరతాబాద్ మహాగణపతి కొలువుదీరాడు. ఇవ్వాల ఉదయం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఖైరతాబాద్ వినాయకుడిని ద‌ర్శించుకుని తొలిపూజ నిర్వ‌హించారు. ప్రజాసంక్షేమాన్ని కోరుకుంటూ ప్రార్థించారు. గవర్నర్ కు పురోహితులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

కాగా, ఖైరతాబాద్ లో తొలిసారిగా మట్టితో చేసిన బొజ్జ గణపయ్య విగ్రహం ఏర్పాటు చేశారు. పంచముఖ మహాలక్ష్మి రూపంలో ఉన్న ఈ ఖైరతాబాద్ గణేశ విగ్రహం ఎత్తు 50 అడుగులు ఉంది. లంబోదరుడికి కుడివైపున షణ్ముక సుబ్రహ్మణ్యస్వామి, ఎడమవైపున త్రిశక్తి మహాగాయత్రీ దేవి కొలువుదీరారు. ఈ భారీ విగ్రహం తయారీకి రూ.1.50 కోట్లు ఖర్చయినట్టు నిర్వాహకులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement