Tuesday, May 7, 2024

పంచ‌ముఖ‌ల‌క్ష్మీగ‌ణ‌ప‌తిగా ఖైర‌తాబాద్ వినాయ‌కుడు-నేటి నుండి ద‌ర్శ‌నం

ఈ సారి ఖైర‌తాబాద్ వినాయ‌కుడు పంచ‌ముఖ‌ల‌క్ష్మీగ‌ణ‌ప‌తిగా ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్నారు.ఈ గణనాథుడిని దర్శించుకునేందుకు నేటి నుంచే భక్తులను అనుమతించనున్నారు. ఈ మేరకు నిర్వాహకులు ప్రకటించారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అంతకుముందు ఈ ఉదయం పద్మశాలి సంఘం తరపున 50 అడుగుల జంధ్యం, కండువా, గరికమాల, పట్టువస్త్రాలను స్వామి వారికి సమర్పించారు. కాగా, భక్తుల సౌకర్యార్థం ఈసారి స్వామివారి ప్రత్యేక పాదాలను ప్రధాన విగ్రహం సమీపంలో ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement