Sunday, April 28, 2024

కొనుగోలు చేసేందుకు వచ్చి.. నమ్మించి దొంగతనం…

వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని గుండ్రపల్లి గ్రామంలోని ఓ ఫెర్టిలైజర్ షాపులో దొంగతనం జరిగినట్లు, అనుమానితులకు సంబంధించి న ఫొటోలను పోలీసులు విడుదల చేశారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. నిన్న మధ్యాహ్నం సమయంలో ఇద్దరు వ్యక్తులు వచ్చి గడ్డి మందు అడిగి ఇస్తున్న క్రమంలో కాంపౌండ్ లో ఉన్న చెట్టు కొమ్మ కావాలని మభ్య పెట్టి.. వ్యాపారస్తుడు అటు వెళ్లిన సమయంలో కౌంటర్ లో ఉన్న దాదాపుగా రూ.30 వేలు దొంగిలించినట్లు తెలిపారు. అనుమానితులు నంబర్ లేని ద్విచక్ర వాహనం పై వచ్చినట్లు,ఎవరికైనా సమాచారం తెలిస్తే అందజేయాలని పోలీసులు తెలిపారు.సీసీ కెమెరాలు లేకపోవడం సైతం ఒకింత దొంగతనాలు జరగటానికి ప్రధాన కారణమని,వ్యాపారస్తులు సీసీ ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement