Sunday, April 28, 2024

TS: రాజన్నను దర్శించుకున్న ప్రభుత్వ విప్‌ ఆది

వేములవాడ, జనవరి 1 (ప్రభన్యూస్‌): సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్‌, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్‌ దర్శించుకున్నారు. ఈసందర్భంగా ఆలయ అధికారులు, అర్చక బృందం ఆయనకు ఘన స్వాగతం పలికారు. గర్భగుడిలో కొలువుదీరిన శ్రీస్వామి వారిని దర్శించుకున్న ఆది శ్రీనివాస్‌ స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు.

అనంతరం మహా మండపంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు ఆలయ పర్యవేక్షకులు తిరుపతిరావు శాలువాతో సత్కరించి స్వామివారి ప్రసాదం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు రాజన్న ఆలయ ప్రధాన అర్చకులు అప్పల భీమాశంకర్‌ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు ఆశీర్వచనం అందజేశారు. ఆయన వెంట కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement