Tuesday, May 7, 2024

కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తేనే మంచిరోజులు : రేవంత్ రెడ్డి

దేశానికి మంచి రోజులు రావాలంటే.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. విద్వేషాలు రెచ్చగొట్టే పార్టీలను భూస్థాపితం చేయాల్సిన బాధ్యత గాంధేయ వాదులపై ఉందన్నారు. పార్లమెంట్ లో 80 మంది కంటే ఎక్కువ మహిళలు లేరని, పెళ్లి ఎప్పుడు చేసుకోవాలి అనేది ఆడ బిడ్డల అభిప్రాయం తీసుకోవాలి కానీ హాడా హుడి నిర్ణయం సరికాదని ఆయన హితవు పలికారు. దేశానికి మోడీ, తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్‌ నాయకత్వం ప్రమాదకరమని ఆయన విమర్శించారు. సోనియా, రాహుల్ గాంధీల నాయకత్వంలో ముందుకు వెళ్దామంటూ ఆయన వ్యాఖ్యానించారు.మతం పేరుతో బీజేపీ రాజకీయం చేస్తుందని ఆరోపించారు. చిల్లర ప్రయత్నాలతో కాంగ్రెస్ చరిత్రను రూపు మాపలేరన్నారు. సోనియా గాంధీ నాయకత్వంలోనే దేశానికి రక్షణ కలుగుతుందని రేవంత్ రెడ్డి అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement