Tuesday, May 7, 2024

Varsha Gaikwad: మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రికి కరోనా

మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్షా గైక్వాడ్‌కు కొవిడ్ సోకింది. ప్రస్తుతం జరుగుతున్న మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ఆమె పాల్గొన్నారు. సోమవారం సాయంత్రం వర్షా గైక్వాడ్ కి కొవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయగా కొవిడ్ పాజిటివ్ అని తేలింది. ఈ మేరకు ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘‘నాకు తేలికపాటి కరోనా లక్షణాలు కనిపించాయి. నేను బాగానే ఉన్నాను, నేను ఐసోలేషన్‌లో ఉన్నాను. గత కొన్ని రోజులుగా నన్ను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవడంతోపాటు జాగ్రత్తలు తీసుకోవాలని తీసుకోండి’’ అని వర్షా గైక్వాడ్ ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement