Tuesday, April 30, 2024

చెట్టుపై నుండి పడి గీత కార్మికుడు మృతి

వర్ధన్నపేట: ఐనవోలు మండలం నందనం గ్రామంలో ప్రమాదవశాత్తు గీత కార్మికుడు పాముల రవీందర్ గౌడ్ (57) తాడి చెట్టుపై నుండి జారిపడి బుధవారం అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు కుల వృత్తిలో భాగంగా కల్లు గీత కోసం చెట్టుపైకి వెళ్లి న త‌రువాత కాలు స్లిప్ అయిన‌ట్టు చెబుతున్నారు. ఇంటి పెద్ద‌ను కోల్పోయిన ఆ కుటుంబ స‌భ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. సమాచారం తెలుసుకున్న ఐనవోలు ఎస్సై భరత్ సంఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించి, పోస్ట్ మార్టం నిమిత్తం మృత దేహాన్ని వర్ధన్నపేట ప్రభుత్వాసుపత్రికి త‌ర‌లించారు. మృతునికి బార్య, కుమారుడు, కూతురు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement