Monday, May 6, 2024

TS | నిఘా నీడలో గణేష్ నిమ‌జ్జ‌నోత్స‌వం.. అవాంఛ‌నీయ ఘటనలు జరగకుండా చ‌ర్య‌లు: సీపీ

నిజామాబాద్ సిటీ, (ప్రభ న్యూస్): నిజామాబాద్ జిల్లాలోని గణేష్ మండపాలపై పోలీసుల నిఘా వ్యవస్థ పటిష్టంగా కొనసాగుతుందని, అన్ని మండపాలను సీసీ కెమెరాల నిఘాలో ఉన్నాయన్నారు సీపీ స‌త్య‌నారాయ‌ణ‌. గణేష్ నవరాత్రి ఉత్సవాలు గణేష్ నిమజ్జనా నికి పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశామని తెలిపారు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో గణేష్ మంట‌పాలపై పోలీసుల నిఘా వ్యవస్థ పటిష్టంగా కొనసాగుతుందన్నారు.

నాలుగు రోజుల క్రితం ప్రారంభమయిన ఉత్సవాల సందర్భం గా గణేష్ మండపాలతో పాటు వాటి పరిసర ప్రాంతాల్లోను అవాంచనీయ ఘటనలు జరగకుండా ముందస్తూ కార్యచరణ చేప‌ట్టామ‌న్నారు. నిజామా బాద్ కమిషనరేటు పరిధిలో మొత్తం 5,405 గణేష్ మండపాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇందులో నిజామాబాద్ డివిజన్ పరిధిలో 2,502 విగ్రహాలు, ఆర్మూర్ డివిజన్ పరిధిలో 1955 విగ్రహాలు, బోధ న్ డివిజన్ పరిధిలో 948 విగ్ర హాలు ఏర్పాటు చేసిన‌ట్టు వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement