Wednesday, May 8, 2024

Gaddam Prasad: స్పీక‌ర్ కు కేటీఆర్ అభినంద‌న‌లు..

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అభినంద‌న‌లు తెలిపారు. స్పీకర్ ఎన్నికకు మద్దతు ఇవ్వాలని మంత్రి శ్రీధర్ బాబు అడగగానే సంపూర్ణ మద్దతు ఇవ్వాలని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశించారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం అసెంబ్లీలో స్పీకర్ ఎన్నికకు ధన్యవాద తీర్మానంపై మాట్లాడుతూ… మధుసూదనాచారి, పోచారం శ్రీనివాస్ రెడ్డి లాగే సభా హక్కులను కాపాడాలని కోరుతున్నట్లు తెలిపారు. సామాన్య ప్రజలు సమస్యలు చర్చకు వచ్చేలా చూడాలన్నారు.

ఎంపీటీసీ నుంచి శాసనసభాధిపతి వరకు ఎదిగిన స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ రాజకీయ ప్రస్థానం అందరికీ స్ఫూర్తిదాయకమని కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారని వెల్లడించారు. 2012 నుంచి 14వరకు చేనేత జౌళి శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో సిరిసిల్లకు వచ్చారని, కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేశారని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement