Thursday, May 2, 2024

Deputy CM: స‌మ‌స్య‌ల‌ను చ‌ర్చించేందుకు ఎక్కువ స‌మ‌యం ఇవ్వండి.. స్పీక‌ర్ ను కోరిన భ‌ట్టి

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ కుమార్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సభలో స్పీకర్‌కు ధన్యవాద తీర్మానంపై ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క మాట్లాడుతూ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ గురించిన విషయాలను సభకు తెలియజేశారు.

ముందుగా స్పీకర్‌గా ఎన్నికైన గడ్డం ప్రసాద్‌కు అభినందనలు తెలిపారు అనంత‌రం ఆయ‌న‌ మాట్లాడుతూ.. పేద వాళ్ళ సమస్యలు తెలిసిన వ్యక్తి ప్రసాద్ కుమార్ అన్నారు. రాష్ట్రంలోని సమస్యలను పెద్ద ఎత్తున చర్చించేందుకు సభ్యులకు ఎక్కువ సమయం ఇస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. శాసనసభలో చర్చలు అర్థవంతంగా నడుపుతారని విశ్వసిస్తున్నానన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement