Saturday, April 27, 2024

Minister: ఆ స్థానంలో మిమ్ముల‌ను చూస్తుంటే నా తండ్రి జ్ఞాప‌కం వ‌స్తున్నారు … మంత్రి దుద్దిళ్ల

హైద‌రాబాద్ – తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ కుమార్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సభలో స్పీకర్‌కు ధన్యవాద తీర్మానంపై శాస‌న‌స‌భ వ్య‌వ‌హారాల శాఖ‌ మంత్రి దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబు మాట్లాడుతూ అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజు స్పీకర్‌గా ఎన్నియ్యారంటూ గడ్డం ప్రసాద్ కుమార్‌కు అభినందనలు తెలిపారు.

శాసనసభలో మంచి సంప్రదాయాన్ని ఏర్పాటు చేస్తారని స్పీకర్ పై పూర్తి నమ్మకం ఉందన్నారు. స్పీకర్‌కు మద్దతు తెలిపినందుకు విపక్ష పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. స్పీకర్ నిర్ణయాలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. తన తండ్రి శ్రీపాద రావు కూడా ఇదే శాసనసభలో పని చేసి ఆ చైర్‌కు ఔన్నత్యాన్ని తీసుకొచ్చారని మంత్రి శ్రీధర్‌బాబు గుర్తుచేశారు..ఆ స్థానంలో మిమ్ముల‌ను చూస్తుంటే త‌న తండ్రి జ్ఞాప‌కం వ‌స్తున్నారంటూ కొంత ఉద్వేగానికి గురయ్యారు శ్రీధ‌ర్ బాబు

Advertisement

తాజా వార్తలు

Advertisement