Wednesday, May 8, 2024

బీజేపీ జెండా దిమ్మెలను కూల్చేస్తే సహించేది లేదన్న‌ కూన శ్రీశైలం గౌడ్

బీజేపీ జెండా దిమ్మెల‌ను కూల్చేస్తే స‌హించేది లేద‌ని బీజేపీ నాయ‌కులు, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ హెచ్చ‌రించారు. గాజులరామారం డివిజన్ అంబేద్కర్ నగర్ లో బీజేపీ నాయకులు ఇటీవల జెండా దిమ్మెను ఏర్పాటు చేసుకుంటే… కొంతమంది అధికార పార్టీ నాయకులు రెండు రోజుల క్రితం కూల్చివేశారు. ఈ విషయాన్ని కూన శ్రీశైలం గౌడ్ దృష్టికి తీసుకొచ్చారు. ఈరోజు కూన శ్రీశైలం గౌడ్ అంబేద్కర్ నగర్ చేరుకుని జెండా దిమ్మెల‌ను పరిశీలించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఆయన మాట్లాడారు. ప్రజా స్వామ్యంలో ఎవరైనా ఏ పార్టీ జెండానైనా పెట్టుకునే హక్కు వుంటుందని.. కాని కొంత మంది అధికార పార్టీ నాయకులు ఈ రకంగా వ్యవహరించడం సరైనది కాదన్నారు. ఎవరో ఒకరి స్వలాభం కోసం ఇలాంటి పనులు చేసి బస్తీలో రెచ్చగొట్టే వారిపట్ల అప్రమత్తంగా వుండాలని కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. శాంతియుతంగా జెండా దిమ్మెల‌ను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు సాయినాధ్, పున్న రెడ్డి, బీజేపీ నాయకులు సంతోష్, నవీన్, సునీల్ పాటిల్, శ్రీనివాస్ రెడ్డి, సతీష్, రామ నరసయ్య, రాజా రెడ్డి, రవి, శ్రీనివాస్, సంతోష్, నర్సింగ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement