Thursday, May 2, 2024

Accident : గద్వాలలో ఘోర రోడ్డు ప్రమాదం…ముగ్గురు స్పాట్ డెడ్

గద్వాల ప్రతినిధి, జనవరి 20(ప్రభ న్యూస్): జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గద్వాల పట్టణం జమ్మిచేడు సమీపంలో డివైడర్ కు కారు ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న 6 మందిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

ఓ వైద్యుని కుమార్తె పుట్టిన రోజు వేడుకలకు హాజరై గద్వాల నుండి పెబ్బేరు కు వెళ్తుండగా జమ్మిచేడు సమీపంలో అర్థరాత్రి ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో మృతులు నరేష్(23)-మల్దకల్, పవన్ కుమార్(28)-పెబ్బేర్, ఆంజనేయులు(50)-గద్వాల లు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురుగోవర్ధన్(20)-మైలగడ్డ, నవీన్(20)-పాల్వాయి,మహబూబ్(23)-గద్వాల లకు తీవ్ర గాయాలు కావడంతో ముగ్గురిని జిల్లా కేంద్రంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందచేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement