Saturday, May 4, 2024

Telangana: రైతు బాంధవుడు కేసీఆర్: పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి

దేశంలో ఏ ముఖ్యమంత్రి రైతులను పట్టించుకోలేదని, రైతులకు పెట్టుబడి ఇచ్చి రాజును చేస్తున్న తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అసలైన రైతు బాంధవుడు అని పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. రైతుబంధు ఉత్సవాల్లో భాగంగా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ జన్మంతా ముఖ్యమంత్రికి రుణపడి ఉంటామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ నూనెటి సంపత్, జడ్పీటీసీ వంగళ తిరుపతి రెడ్డి,మండల పార్టీ అధ్యక్షుడు గొడుగు రాజ కొమురయ్య, అధ్యక్షుడు నిదానపురం దేవయ్య,ఛైర్మెన్ చదువు రామచంద్రారెడ్డి, ఎంపీటీసీ నిర్మల-మల్లారెడ్డి,యూత్ మండలాధ్యక్షుడు నూనెటి కుమార్,గ్రామ శాఖ అధ్యక్షుడు కూకట్ల నవీన్, తెరాస నాయకులు జంగ రమణారెడ్డి,ఈర్ల శ్రీనివాస్,పత్తి కృష్ణారెడ్డి,మాజీ ఎంపీటీసీ రాంచంద్రం,తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ప్రపంచంలోనే అతి గొప్ప పథకం రైతుబంధు..
ప్రపంచంలోనే రైతు బంధు పథకం అతి గొప్పదని పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం రైతు బంధు వారోత్సవాలలో భాగంగా పెద్దపల్లి మండలం హనుమంతుని పేటలో ట్రాక్టర్ లతో ర్యాలీ నిర్వహించి సీఎం కేసీఆర్ చిత్రపటానికి రైతులతో కలసి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో తెరాస ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తల తోపాటు రైతులు,గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement