Sunday, April 28, 2024

పంజాబ్ రాష్ట్ర ఐకాన్, ఎన్నిక‌ల సంఘం ప్ర‌చార‌క‌ర్త ప‌ద‌వి నుంచి త‌ప్పుకున్న ‘సోనూసూద్’

పంజాబ్ రాష్ట్ర ఐకాన్, ఎన్నిక‌ల సంఘం ప్ర‌చార‌క‌ర్త ప‌ద‌వి నుంచి త‌ప్పుకున్నాడు హీరో సోనూసూద్. అన్ని మంచి విష‌యాల్లాగే ఈ ప్ర‌యాణం కూడా ముగిసింద‌ని తెలిపాడు. పంజాబ్ రాష్ట్ర చిహ్నంగా నేను స్వ‌చ్చందంగా వైదొలిగాన‌ని చెప్పారు. త్వ‌ర‌లో రానున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో నా కుటుంబ స‌భ్యులు పోటీ చేస్తోన్న నేప‌థ్యంలో ఈసీతో చ‌ర్చ‌లు జ‌రిపి ఈ నిర్ణ‌యాన్ని తీసుకున్నాన‌ని సోనూసూద్ వివ‌రించాడు. కరోనా లాక్‌ డౌన్‌ సమయంలో.. సోనూసూద్‌ చేపట్టిన దాతృత్వ కార్యక్రమాలను నిరాటకంగా కొనసాగిస్తున్నారు సోనూ సూద్.ఈ నేపథ్యంలో ఆయన సొంత రాష్ట్రమైన పంజాబ్‌ లో సోనూసూద్‌ కు మంచి ఆదరణ లభించింది. దీంతో ఆయనను పంజాబ్‌ లో సోనూసూద్‌ కు మంచి ఆదరణ లభించింది. దీంతో ఆయనను పంజాబ్‌ స్టేట్‌ ఐకాన్‌ గా పేర్కొంటూ ఎన్నికల సంఘం తరఫున ప్రచారకర్తగా ఈసీ నియమించిన సంగ‌తి తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement