Friday, May 3, 2024

కార్తీక మాసోత్సవాలు: గణపేశ్వరాలయంకు గో దానం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురంలోని కాకతీయుల కళా క్షేత్రం భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లకు సోమవారం ములుగుకు చెందిన సానికొమ్ము రామిరెడ్డి కుటుంబం గో దానం చేశారు. కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకొని మొదటి సోమవారం శాస్త్రోక్తంగా స్వామివారికి అభిషేకం నిర్వహించిన అనంతరం గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోవును అర్చకులు నరేష్ చేతులమీదుగా ఆలయానికి బహుకరించారు. ఈ సందర్భంగా గోదాత మాట్లాడుతూ కోటగుళ్లు ప్రాంగణంలో  గోశాల నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తమ కుటుంబం నుంచి గోశాలకు అవును అందజేయడం తమ పూర్వజన్మ సుకృతం అని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఆలయానికి తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement