Tuesday, May 7, 2024

టేస్టీ మండి హౌస్ ను ప్రారంభించిన మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి

రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం నియోజకవర్గంలో ప‌ర్య‌టించారు. నియోజ‌క‌వ‌ర్గంలోని తుక్కు గూడ మున్సిపాలిటీ పరిధిలోని ఇమాంగూడలో టేస్టీ మండి హౌస్ హోటల్ ను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. కల్వకుర్తి పర్యటనకు వెళ్తూ మధ్యలో హోటల్ ప్రారంభించారు. మంత్రి వెంట ఎమ్మెల్సీ వాణీదేవి.. కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, తదితరులు ఉన్నారు. ఈసందర్భంగా హోటల్ యాజమాన్యాన్ని మంతి అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement