Sunday, May 5, 2024

అధిష్టానం టిక్కెట్టు ఇంకా ఎవరికీ ఖరారు చేయలేదు…మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి

షాద్ నగర్ ఆగస్టు 19 ప్రభన్యూస్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల షాద్ నగర్ నియోజకవర్గం బి ఆర్ఎస్ పార్టీ టికెట్లను ఇంకా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరికి ఖరారు చేయలేదని, మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం అని ప్రజలు కార్యకర్తలు నమ్మవద్దని షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే టిఆర్ఎస్ నాయకుడు చౌలపల్లి ప్రతాపరెడ్డి అన్నారు .

శనివారం నాడు ఆయన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టికెట్ అనేది అధిష్టానం నిర్ణయిస్తుందని ఇప్పటివరకు సర్వేలు జరుగుతున్నాయని ఎవరికి టికెట్ వచ్చినా…బి ఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలని అన్నారు. ఇటీవల సోషల్ మీడియాలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కు టికెట్ వచ్చిందని పుకార్లు లేపుతున్నారు. కొందరు తనకే టికెట్ వచ్చిందని పుకార్లు చేస్తున్నారని అలాంటి పుకార్లను ప్రజలు నమ్మవద్దని అన్నారు కొందరు తమకే టికెట్ వచ్చిందని బాలసంచా పేలుస్తూ స్వీట్లు పంచి పెడుతున్నారని ప్రజలను తప్పుదోవ పట్టించడం కోసమే ఇలాంటివి చేస్తున్నారని అన్నారు.

తాను ఒకసారి ఎమ్మెల్యేగా చేశానని మూడుసార్లు అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్నానని తనకు క్యాడర్ ఉందని నియోజకవర్గంలో తన కేడర్ గట్టిగానే ఉందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరికి టికెట్ ఇచ్చినా షాద్నగర్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని గెలిపించుకుంటామని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ టికెట్ తనకే ఇస్తున్నార‌ని, త్వరలో జాబితా విడుదల చేస్తారని అన్నారు

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement