Sunday, May 5, 2024

TS : కేసీఆర్ అవినీతి పాలనకు అంతం తథ్యం.. బిజెపి ప్రచార కమిటీ చైర్మన్ ఈటల

నిజామాబాద్ సిటీ, నవంబర్10 (ప్రభన్యూస్);
నిజామాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో బిజెపి జెండా ఎగరడం ఖాయమని, కేసిఆర్ అవినీతి పాలనకు అంతం తప్పదని ఎన్నికల్లో ప్రజలే గుణ పాఠం చెబుతారని బిజెపి ప్రచార కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ అన్నారు. నిజామాబాద్ జిల్లాలో బిజెపి అత్యధిక సీట్లను సాధిస్తుందన్నారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ గ్రామీణ నిజామాబాద్ నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థిగా దినేష్ కులాచారి, ఈటల రాజేందర్ లతో కలిసి నామి నేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి సమర్పించారు.

నామినేషన్ వేసినా అనంతరం విలేకరులతో ఈటల మాట్లా డుతూ బీసీలకు రాజ్యాధికారం కట్టబెట్టాలని మోడీ ప్రకటిం చిన తర్వాత 52 శాతం ఉన్న బీసీలు అందరి సంఘటితమై మన ఓట్లు మనకే వేసుకొని బిజెపి అభ్యర్థులను గెలిపించు కోవాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో ఈ సంకల్పం బలంగా కనబడుతుంది అన్నారు. ఏ పార్టీ గెలవాలన్నా ఆ పార్టీ బ్రతికి బట్ట కట్టాలన్న బీసీల ఓట్లే కీలకమని అన్నారు. ఇన్ని ఏళ్ళు మా ఓట్లు వేసుకుని పరిపాలించిన పార్టీలు మా జాతుల పట్ల మా కులాల పట్ల వ్యవహరించిన తీరు అర్థమ వుతుందని అన్నారు. మా ఓట్లతో మీకు లబ్ధి జరిగిందో, మీ ఓట్లతో మాకు లబ్ది జరిగిందో రానున్న ఎలక్షన్ లో 52 శాతం ఉన్న బీసీలు ,ఎస్సీ ఎస్టీలు సంఘటితమై మీకు బుద్ధి చెప్తారని బీసీని ముఖ్య మంత్రిని తప్పకుండా చేసుకుం టామని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి నిజామాబాద్ వచ్చి పసుపు బోర్డ్ అనౌన్స్ చేసిన తరువాత నిజామాబాద్ లోని అన్ని నియోజక వర్గాలలో ఉన్న రైతాంగం మొత్తం బీ జే పీ వైపు మళ్లీందని బావిస్తు న్నామ ని అన్నారు.కాంగ్రెస్ 40 ఏళ్లు పరిపాలించిప్పటికి ఒక్కనాడు కూడా 52 శాతంగా ఉన్న మా జాతుల పట్ల కనీసం గౌరవం గుర్తింపు లేకుండా పోయిందని అన్నారు. ఈ సమావేశంలో అధ్యక్షులు బసవ లక్ష్మీ నరసయ్య, రూరల్ నియోజ కవర్గ బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement