Wednesday, May 1, 2024

AP : పోలీస్ ఫైరింగ్ రేంజ్ స్థల పనులను పరిశీలన చేసిన జిల్లా ఎస్పీ ఎస్వీ.మాధవ్ రెడ్డి

శ్రీ సత్యసాయి బ్యూరో నవంబర్ 10: (ప్రభన్యూస్)
బుక్కపట్నం -ముదిగుబ్బ ప్రధాన రహదారి లో బుచ్చయ్య గారిపల్లి గ్రామ సమీపంలో పోలీస్ శాఖకు చెందిన స్థలంలో జరుగుతున్న పనులను, పైరింగ్ రేంజ్ నిమిత్తం శుక్రవారం, జిల్లా ఎస్పీ ఎస్వీ.మాధవ్ రెడ్డి పరిశీలించారు. నూతనంగా ఏర్పడిన శ్రీ సత్యసాయి జిల్లాలో పోలీస్ శాఖ కి పైరింగ్ రేంజ్ ఏర్పాటు లో బాగంగా బ్రిటిష్ కాలంలోనే పోలీస్ కార్యకలాపాల అవసరనిమిత్తం పోలీస్ శాఖకి కేటాయించిన నాలుగు ఎకరాల 40 సెంట్లు స్థలాన్ని ఎస్పీ పరిశీలించారు.

పనులు జరుగుతున్న ప్రాంతాన్ని పోలీస్ అధికారులతో పర్యటించి ఏ విధంగా పనులు జరుగుతున్నాయి అనే విషయాన్ని అధికారుల ద్వారా ఎస్పీ తెలుసుకున్నారు. ఈనెల ఆఖరిలోపు పనులు పూర్తి చేయాలని ఎస్పీ పోలీస్ అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమం లో ఎస్పీ తో, పుట్టపర్తి డిఎస్పి వాసుదేవన్, పాటు ఎ ఆర్ డి.ఎస్.పి జెడ్.విజయ్ కుమార్ , ఎఆర్ అడ్మిన్ ఆర్ లు టైటాస్ , రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ లు నరసింహులు, విజయ్ కుమార్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement