Monday, May 6, 2024

NLG :బీఆర్ఎస్ పార్టీకి రాజీనామాలు చేసిన ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ లో చేరిక

చౌటుప్పల్, నవంబర్ 10 (ప్రభ న్యూస్) : తెలంగాణ మున్సిపల్ ఛాంబర్ చైర్మన్, చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, మునుగోడు జెడ్పిటిసి సభ్యురాలు నారబోయిన స్వరూపారాణి రవి ముదిరాజ్, నాంపల్లి జెడ్పిటిసి ఏలుగోటి వెంకటేశ్వర్ రెడ్డి, నారాయణపురం ఎంపీపీ గుత్తా ఉమా ప్రేమ్ చందర్ రెడ్డి, నాంపల్లి వైసీపీ ఎంపీపీ పానుగంటి రజిని వెంకన్న, మునుగోడు వైస్ ఎంపీపీ అనంత వీణ స్వామి గౌడ్, మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యులు మహమ్మద్ రఫీక్ తదితర నాయకులు బీఆర్ఎస్ పార్టీకి మూకుమ్మడిగా రాజనామాలు చేసి శుక్రవారం మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

వారికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులంతా గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లి తిరిగి సొంత పార్టీలో చేరడం పట్ల రాజగోపాల్ రెడ్డి హర్ష వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులను అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement