Sunday, April 28, 2024

HYD : బిజెపి అభ్యర్థిని గెలిపించాల‌ని వీరేందర్ బాబు యాదవ్ ఎన్నిక‌ల ప్ర‌చారం

కర్మన్ ఘాట్, నవంబర్ 21(ప్రభ న్యూస్) యాకత్పురా నియోజకవర్గంలో బిజెపిని గెలిపించాలని అభ్యర్థి వీరేందర్ బాబు యాదవ్ కోరారు. నియోజకవర్గ పరిధిలోని వివిధ కాలనీలో కార్యకర్తలు నాయకులతో కలిసి ఇంటింటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. గత పది సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు.

ప్రతి ఒక్కరికి ఉచితంగా ఐదు కిలోల బియ్యాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ పాలన కొనసాగిస్తూ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. బిజెపి అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే ఒకసారి బిజెపికి అవకాశం కల్పించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement