Monday, May 6, 2024

EC Order – ‘రైతుబంధు’ అనుమతులు ర‌ద్దు..పంపిణీకి బ్రేక్


హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. నియమాలు ఉల్లంఘించారని.. రైతుబంధు సాయం పంపిణీకి ఇచ్చిన అనుమతిని ఈసీ ఉపసంహరించుకుంది. ఈనెల 28లోపురైతుబంధు ఇచ్చేందుకు మూడురోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వానికి ఈసీ అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. రైతు బంధుల‌ను ఎన్నిక‌ల ప్ర‌చారంలో వినియోగించ‌కూడ‌ద‌నే ష‌ర‌తు విధించింది.. అయితే బిఆర్ఎస్ నేత‌లు కొంద‌రు త‌మ ప్ర‌సంగాల‌లో రైతుబందును ప్ర‌స్తావించారు.. దీనిని కోడ్ ఉల్లంఘ‌న కింద భావించిన ఎన్నిక‌ల సంఘం తాజాగా ఆ అనుమ‌తులు ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement