Friday, May 3, 2024

Cash seized :ఖ‌మ్మం జిల్లాలో 3.50కోట్ల న‌గ‌దు ప‌ట్టివేత

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో 3.5 కోట్ల రూపాయలు పట్టుబడింది. ఐటీ, ఈసీ ఫ్లైయింగ్ స్వ్కాడ్ అధికారులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు.

ఖమ్మం రూరల్ మండలం వరంగల్ క్రాస్ రోడ్డు శ్రీరామ్ నగర్ లో తెల్లవారుజామున రూ. 3.50 కోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు నారాయణపేట జిల్లాలో ఐటీ దాడులు జరిగాయి. ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అనుచరులు, బంధువుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేశారు. 10 మంది బృందంతో నారాయణపేటలో విస్తృతంగా సోదాలు నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement