Friday, May 3, 2024

TS: ఐచర్ వ్యాన్ ఢీకొని తండ్రి, కొడుకుల మృతి

జన్నారం, సెప్టెంబర్7 (ప్రభ న్యూస్): శ్రీ కృష్ణాష్టమి పండగ రోజు విషాదం నెలకొంది. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కలమడుగు గ్రామంలో రోడ్డు పక్కన కూర్చున్న తండ్రి, కొడుకులను గురువారం మధ్యాహ్నం ఐచర్ వ్యాన్ ఢీకొనగా, ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు మెదక్ జిల్లా అనంతారం మండలం అంతరం గ్రామానికి చెందిన జోగు సాయికుమార్ (36), కుమారుడు జోగు లక్ష్మన్ (8), భార్యతో అంతరం వెళ్లడానికి అక్కడ బస్సు కోసం వేచి ఉన్న ఇద్దరిని లోడుతో ఉన్న ఐచర్ వ్యాన్ ఢీకొనగా తండ్రి, కొడుకు అక్కడికక్కడే చనిపోయారు.

భార్య ప్రమాదంకు ముందు త్రాగునీటి కోసం పక్కనే ఉన్న బోరువెల్ వద్దకు వెళ్లగా బ్రతికి బయటపడింది. ఐచర్ వ్యాన్ డ్రైవర్ అతివేగంగా అజాగ్రత్తగా వాహనాన్ని నడపడం వల్ల ఆ ఇద్దరిని ఢీకొని పక్కనే మినీ ట్రాన్స్ఫార్మర్ తో ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొనగా తండ్రి, కొడుకు అక్కడికక్కడే చనిపోగా, స్తంభంతో ట్రాన్స్ ఫార్మర్ ఇరిగి కింద పడిపోయింది. సంఘటన స్థలంలో భర్త, కొడుకు మృతదేహాలపై భార్య పడి కన్నీరు మున్నీరుగా విలపించారు. స్థానిక ఎస్సై సతీష్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement