Friday, May 3, 2024

NLG: మాటలు చెప్పేది కాదు.. అభివృద్ది చేసేదే తమ ప్రభుత్వం… కూసుకుంట్ల

మునుగోడు, సెప్టెంబర్ 7 (ప్రభ న్యూస్): తమది మాటలు చెప్పే ప్రభుత్వం కాదని, అభివృద్ధి చేసి చూపించేదే తమ ప్రభుత్వమని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఈరోజు మండల కేంద్రంలోని వ్యాపార సముదాయాల వెనుక భాగంలో గల ప్రధాన మురికి కాలువను గతంలో పరిశీలించి అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన ప్రకారం నెల రోజుల్లో అండర్ డ్రైనేజీ పనులను పూర్తి చేసి మాట నిలబెట్టుకున్నారు. కాలనీవాసుల అభీష్టం మేరకు ఆ ప్రాంతాన్ని ఈ రోజు పరిశీలించడం జరిగింది.

అడుగడుగునా కాలనీవాసులు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఘన స్వాగతం పలుకుతూ.. శాలువతో సన్మానించారు. తమ సమస్యను త్వరితగతిన పూర్తి చేయించిన ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలుపుతూ రాబోయే ఎలక్షన్లో తమ వంతు గెలుపుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఎనిమిదో వార్డులో కాలినడకన తిరుగుతూ వార్డు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా అవసరమైన డ్రైనేజీ పనులను త్వరితగతిన పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బండ పురుషోత్తం రెడ్డి, ఎంపీపీ కర్నాటి స్వామి యాదవ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఏరుకొండ శ్రీనివాస్, నాయకులు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, ఈద శరత్ బాబు, రావిరాల కుమారస్వామి, పందుల శ్రీను, యడవల్లి సురేష్, వార్డు మెంబర్లు యర్రబెల్లి శంకర్ రెడ్డి, పాలకూరి అశోక్, నరేష్, వట్టికోటి నరసింహ, పెరుమాళ్ళ ప్రణయ్, ఏర్పుల స్వామి, దుబ్బ రవి, దుబ్బ రాజు, మార్నేని భాస్కర్, ఎండి వాజిద్, పందుల పాపయ్య, పందుల లింగస్వామి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement