Thursday, May 2, 2024

ఆందోళన వద్దు, ప్రభుత్వం అండగా ఉంటుంది.. దెబ్బతిన్న పంటలను పరిశీలించిన బోయినపల్లి

అకాల వర్షం, వడగండ్ల వానతో కరీంనగర్ జిల్లాలో పంట నష్టం జరిగిన ప్రాంతాలను ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ఇవ్వాల పరిశీలించారు. పంట పొలాలను పరిశీలించి బాధిత రైతులతో మాట్లాడారు. నష్టం వివరాలను తెలుసుకున్నారు. ప్రకృతి వైపరీత్యాలతో చేతికి వచ్చిన పంటలు దెబ్బతిన్నాయని వినోద్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు అధైర్య పడవద్దని, ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

పంటల నష్టం వివరాలను అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులకు, జిల్లా కలెక్టర్ ఆర్ వీ కర్నాణ్​ కు సూచించారు. చొప్పదండి నియోజకవర్గంలోని రామడుగు, దత్తోజిపేట.. చొప్పదండి మండలం మంగళపల్లిలోని పంట పొలాల్లో దిగి దెబ్బ తిన్న పంటల పరిస్థితిని స్వయంగా చూశారు. గ్రామస్థులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement