Tuesday, April 30, 2024

మల్లన్న సన్నిధిలో భక్తుల సందడి.. ఓదెలలో మొక్కులు చెల్లింపు

ఓదెల‌, (ప్రభ న్యూస్) : పెద్దపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఓదెల మల్లిఖార్జునస్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. ఆదివారం జాతర దినం కావడంతో భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకొని పూజలు చేశారు. పట్నాలు, బోనాలు సమర్పించుకున్నారు. మహిళలు గoడ దీపం వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. పలువురు భక్తులు కోడె మొక్కులు చెల్లించుకొన్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంద్దులు కలుగకుండా ఆలయ అధికారులు, సిబ్బంది తగిన చర్యలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement