Wednesday, April 24, 2024

మచిలీపట్నంలో మైన‌ర్ బాలుడు ఆత్మహత్య.. ప‌బ్‌జీలో ఓట‌మిని త‌ట్టుకోలేకే!

మచిలీపట్నం : ఏపీలోని మచిలీపట్నంలో మైనర్ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మచిలీపట్నం న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన ఊటుకూరు ప్రభు (16) తొమ్మిదో తరగతి వరకు చదువుకున్నాడు. వేసవి సెలవులు కావడంతో నిన్న రాత్రి ఇంట్లో వాళ్లతో కలిసి పబ్జి గేమ్ ఆడాడు. ఆ గేమ్ ఓడిపోవడంతో ఇంట్లో పిల్లలు హేళన చేశారు. దీంతో అవమానం తట్టుకోలేక వేరే గదిలో పడుకుంటాన‌ని ప్ర‌భు వెళ్లాడు. ఆదివారం ఎంతకీ బయటకి రాకపోవడంతో నిద్ర లేపెందుకు తండ్రి తలుపులు తీశాడు. అయితే త‌న కొడుకు క‌న‌బ‌డిని రీతిలో ఉండ‌డంతో ఆందోళ‌న‌కు గుర‌య్యాడు. ప్ర‌భు ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించడంతో సొమ్మసిల్లిన ప‌డిపోయాడు. మైనర్ బాలుడి మరణంతో న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీ లో విషాదం నెల‌కొంది. దీనిపై మరిన్ని వివరాలు పోలీసులు సేక‌రిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement