Sunday, April 28, 2024

TS: శివుడి ఆశీస్సులతో రాష్ట్రం అభివృద్ధి జరగాలి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

వైరా, మార్చి 8 (ప్రభ న్యూస్): ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామం శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, నందిని దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహాశివరాత్రి సందర్భంగా జరిగే జాతర ఉత్సవాలను పుణ్యస్నానాలు జరిగే ప్రాంతాన్ని సందర్శించారు. జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రపంచవ్యాప్త తెలుగు ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం శివుని అనుగ్రహంతో ఎంతో అభివృద్ధి జరగాలని కోరారు. మహాశివరాత్రి రోజు శివుని పూజించటం ఎంతో శుభప్రదమన్నారు. ప్రతి ఒక్కరూ భక్తి భావంతో పూజించి అభివృద్ధి చెందాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పూవాళ్ళ దుర్గాప్రసాద్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెంకట నర్సిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement