Sunday, April 28, 2024

TS : ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి

హ‌నుమకొండ జిల్లా భీమారం బ్రాంచ్ శివాని ఇంట‌ర్మీడియ‌ట్ కాలేజీలో ఇంట‌ర్ విద్యార్థిని అనుమానాస్పద‌స్థితిలో మృతి చెందింది. కాలేజీలో ఎంపీసీ మొద‌టి సంవ‌త్సరం చ‌దువుతున్న హ‌నుమకొండ జిల్లా శాయంపేట మండ‌లం గ‌ట్లకానిప‌ర్తి గ్రామానికి చెందిన వ‌లుగుల సాహిత్య గురువారం రాత్రి కాలేజీ బిల్డింగ్‌పై నుంచి దూకిన‌ట్లుగా చెబుతున్నార‌ని మృతురాలి బంధువులు పేర్కొంటున్నారు.

గురువారం రాత్రి ఘ‌ట‌న జ‌రిగినా.. శుక్రవారం ఉద‌యం వ‌ర‌కు త‌మ‌కు స‌మాచారం అందించలేద‌ని, నేరుగా పోస్ట్‌మార్టం త‌ర‌లించాక ఫోన్‌లో తెలిపార‌ని అన్నారు. విద్యార్థిని మృతిపై యాజ‌మాన్యం గోప్యత పాటించ‌డంపై అనుమానాలున్నాయ‌ని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement