Tuesday, May 7, 2024

Crime – మ‌ద్యానికి బానిసైన తండ్రి – పైకి పంపేసిన సుపుత్రుడు

వాజేడు,సెప్టెంబర్‌28 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మద్యానికి బానిసైన కొడుకును మంద లించినందుకు తండ్రినే హతమార్చిన విషాద సంఘటన వాజేడు మండలం పేరూరు గ్రామ పంచాయతీలోని చిన్నగొల్లగూడెం గ్రామంలో గురువారం చోటు చేసుకుంది.పేరూరు ఎస్సై గొర్ల రమేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బంధం రాములు(50) మద్యానికి బానిసై తరచూ భార్య నాగచంద్ర, కొడుకు నరేశ్‌ను తిడుతుండేవాడు .

ఈ నేపథ్యంలో గ‌త రాత్రి మద్యం మత్తులో వచ్చి తిట్టడంతో కోపోద్రిక్తుడైన నరేశ్‌ గొడ్డలితో తండ్రి తలపై నరకడంతో రాములు మృతి చెందాడు. నరేశ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రాములు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement