Thursday, May 2, 2024

Tragedy – నిమ‌జ్జ‌న వేడుక‌ల‌లో అప‌శృతి… నీట మునిగి ముగ్గురు యువ‌కులు గ‌ల్లంతు ..

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం : భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో నిర్వ‌హించిన గ‌ణేశ్ నిమ‌జ్జ‌న వేడుక‌ల్లో అప‌శృతి చోటు చేసుకుంది. భ‌ద్రాచ‌లం వ‌ద్ద గోదావ‌రి న‌దిలో నిమ‌జ్జ‌నానికి వెళ్లిన ఓ ముగ్గురు యువ‌కులు నీట మునిగారు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది.. ఇద్ద‌రు యువ‌కుల‌ను ప్రాణాలతో ఒడ్డుకు చేరారు. గ‌ల్లంతైన మ‌రో యువ‌కుడి కోసం గాలింపు చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. యువకులను భద్రాద్రికొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం తడికలపుడికి చెందిన లకావత్ గణేష్, తేజ‌గా గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement