Tuesday, May 14, 2024

పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా క్రికెట్ టోర్నమెంట్..

కొత్తకోట మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలో పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా క్రికెట్ టోర్నమెంట్ ను ఏర్పాటు చేశారు. కొత్తకోట ఎంపీపీ గుంత మౌనిక మల్లేష్ ఆధ్వర్యంలో కనిమెట్ట గ్రామ యువకులకు సర్పంచ్ గాదం రాణి పరమేష్ ఈ ఏర్పాట్ల‌ను చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వనపర్తి డీఎస్పీ కిరణ్ కుమార్ ను ఎంపీపీ శాలువాతో సన్మానించి ..పూలమొక్కను అందించారు. అనంతరం డీఎస్పీ ఆటల‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన యువతను ఉద్దేశించి మాట్లాడుతూ ఎవరి ప్రలోభాలకు త‌లొంచ‌వ‌ద్ద‌ని తెలిపారు. కులమతాలకు అతీతంగా అందరూ సంతోషంగా క్రికెట్ టోర్నమెంట్ పూర్తిచేసుకొని కలిసి ఉండాలన్నారు. అలాగే ఈ టోర్నమెంట్ కు సహకరిస్తున్న ఆరోగ్య క్రికెట్ క్లబ్ నిర్వాహకులను అభినందిస్తూ డీఎస్పీ తన విద్యార్థి దశలో క్రికెట్ లో పాల్గొన సందర్భాలను గుర్తు చేసుకున్నారు.

ప్రపంచం మహమ్మారి కరోనా కారణంగా లాక్ డౌన్ సమయంలో పోలీస్ శాఖకు , ఆసుపత్రి సిబ్బందికి, మున్సిపల్ కార్మికులకు, 45 రోజులపాటు ఎంపీపీ గుంత మౌనిక మల్లేష్ అందించిన సేవలు మరిచిపోలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తకోట సీఐ మల్లికార్జున్ రెడ్డి , ఎస్. ఐ నాగ శేఖర్ రెడ్డి ఎంపీపీ గుంత మౌనిక మల్లేష్ , కనుమెట్ట గ్రామ సర్పంచ్ గాదం రాణీ పరమేష్ , కొత్తకోట తెరాస పట్టణ అధ్యక్షులు బాబు రెడ్డి, వార్డు కౌన్సిలర్ , సంధ్య రవీందర్ రెడ్డి , సింగిల్ విండో డైరెక్టర్ బాలకృష్ణ రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు వసీం ఖాన్ యువకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement