Sunday, May 5, 2024

చంద్రబాబుపై అమిత్ షాకు ఎంపీ గోరంట్ల ఫిర్యాదు

కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను హిందూపురం వైఎస్సార్‌సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ కలిశారు. వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ పై తెలుగుదేశం అధినేత చంద్రబాబు అసభ్యకరంగా మాట్లాడుతున్నారని ఫిర్యాదు చేశారు. మాధవ్ తో  దాదాపు పది నిమిషాలు పాటు కేంద్ర హోంమంత్రి సమయం కేటాయించారు. ఆధారాలతో సహా తన లెటర్ ప్యాడ్ లో  వివరాలు పొందుపరుస్తూ హోంమంత్రికి గోరంట్ల మాధవ్ అందజేశారు. తాము చేసిన ఫిర్యాదును పరిశీలిస్తానని హోం మంత్రి హామీ ఇచ్చినట్లు ఎంపీ గోరంట్ల మాధవ్ వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Breaking: టీడీపీ గుర్తింపు రద్దు చేయండి: ఈసీకి వైసీపీ ఫిర్యాదు

Advertisement

తాజా వార్తలు

Advertisement