Sunday, April 28, 2024

ఉప్ప‌ల్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ – 2,500మంది పోలీసుల‌తో భారీ భ‌ద్ర‌త‌

మూడు సంవ‌త్స‌రాల త‌ర్వాత ఉప్ప‌ల్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఇండియా – ఆస్ట్రేలియా మధ్య చివరి టి-20 మ్యాచ్ జరగనుంది. 2500 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేసారు రాచకొండ పోలీసులు. ఇప్పటికే నాగపూర్ నుండి హైదరాబాద్ కు చేరుకున్నాయి ఇరు జట్లు. 300 సీసీ కెమెరాలతో నిఘా కట్టుదిట్టం చేశారు పోలీసులు. గ్రౌండ్ లో కూర్చున్న ప్రతి వ్యక్తిని గుర్తించేలా ప్రత్యేకమైన కెమెరాలు ఏర్పాటు చేశారు. మొబైల్ మినహా ఎలక్ట్రానిక్ గూడ్స్ కి అనుమతి లేదంటున్నారు పోలీసులు. అక్టోపస్ బలగాలు రెండు గ్రూపులు, షార్ట్ షూటర్స్ మరో రెండు గ్రూపులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ మ్యాచ్ కి 35వేల నుండి 38 వేల వరకు అభిమానులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే 21 పార్కింగ్ ప్లేస్ లు ఏర్పాటు చేశారు ట్రాఫిక్ పోలీసులు..ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో మూడు చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేశారు. సాయంత్రం నాలుగు గంటల నుండి మధ్యరాత్రి ఒంటిగంట వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement