Monday, May 20, 2024

Breaking: మ‌ర్డ‌ర్‌ కేసులో కార్పొరేటర్ భర్త.. ఎంక్వైరీ చేస్తున్న‌ పోలీసులు

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఓ కార్పొరేటర్ భర్త హత్య కేసులో నిందితునిగా అనుమానిస్తూ కరీంనగర్ పోలీసులు అదుపులో తీసుకున్నట్లు సమాచారం. జూన్ 2వ తేదిన తిమ్మాపూర్ మండలం కేంద్రానికి చెందిన 32 సంవత్సరాల యువకుడు కాకతీయ కాలువ వద్ద మృతిచెందినట్లు చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికులతో సమాచారం తెలుసుకొని కుటుంబ సభ్యులకు సమాచారం తెలియజేశారు. దీంతో సంఘటన స్థలానికి వచ్చిన కుటుంబ సభ్యులు మృతదేహాన్ని చూసి గుండెలు పగిలేలా విలపించారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మానకొండూరు సీఐ కి మృతి పై పలు అనుమానాలు ఉన్నట్లు కుటుంబ సభ్యుల ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తులో భాగంగా కరీంనగర్ రూరల్ ఏసీపీ కరుణాకర్ ఆదేశాల మేరకు పోలీసులు అధికారులు ఖని ప్రాంతాలలోనీ అధికార పార్టీ కార్పొరేటర్ ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సొంత బావమరిది ఆస్తి కోసం కార్పొరేటర్ భర్త హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించినట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement