Sunday, May 5, 2024

Covid: ఇక్ఫాయి బిజినెస్ స్కూల్ లో కరోనా కలకలం

రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండల పరిధిలోని దొంతాన్ పల్లి వద్ద ఉన్న ఐబిఎస్ ఇక్ఫాయి బిజినెస్ స్కూల్లో కరోనా వైరస్ విజృంభించింది. టంగుటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన వైద్య బృందం సభ్యులు కళాశాల పరిధిలో 280 మందికి పరీక్షలు నిర్వహించగా వారిలో 23 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు వెల్లడైంది. దీంతో విద్యార్థుల్లో తీవ్ర అలజడి నెలకొంది. కరోనా వైరస్ కలకలం గురించి యాజమాన్యం నుండి ఎటువంటి స్పందన లేదు. అయితే, కరోనా సోకిన విద్యార్థులకు కళాశాలలోని ఐసోలేషన్ వార్డులను ఏర్పాటుచేసి వైద్యం అందిస్తున్నారని ప్రాథమిక కేంద్రానికి చెందిన వైద్య బృందం సభ్యులు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement