Thursday, April 25, 2024

మ‌హేశ్ బాబు కోలుకోవాల‌ని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్

టాలీవుడ్ లో క‌రోనా క‌ల‌క‌లం రేగుతోంది. ఒక్కొక్క‌రికి క‌రోనా సోకుతోంది. కాగా రీసెంట్ గా టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబుకి క‌రోనా పాజిటీవ్ గా నిర్థార‌ణ అయింది. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా ట్వీట్ చేశారు. కాగా తాను ఐసోలేష‌న్ లో ఉన్నాన‌ని చెప్పారు. కాగా ఈ నేప‌థ్యంలో మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. మహేశ్ బాబు నీవు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని చిరంజీవి ట్వీట్ చేశారు. నీవు తిరిగి మళ్లీ యాక్షన్ లోకి వచ్చేంత వరకు తాను ఆగలేనని అన్నారు. మరోవైపు మహేశ్ కరోనా బారిన పడటంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఇప్పుడు చిరంజీవి ట్వీట్ వైర‌ల్ గా మారింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement