Sunday, May 12, 2024

టీఆర్ఎస్, ఎంఐఎమ్, కాంగ్రెస్ పార్టీల కుట్ర‌.. సికింద్రాబాద్ ఘ‌ట‌న‌పై బండి ఆరోప‌ణ‌

కామారెడ్డి, (ప్రభ న్యూస్) : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ధ్వంసo చేయడం.. విధ్వంసక చర్యలకు పాల్పడడం టీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీల కుట్ర అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కామారెడ్డి జిల్లా జాతీయ రహదారి 44లో విలేకరులతో ఆయ‌న మాట్లాడారు.

ఆర్మీలో చేరాలనుకోవడం దేశభక్తులు దేశ క్షేమం కోరే యువత లక్ష్యం అని బండి సంజయ్ పేర్కొన్నారు. సికింద్రాబాద్ స్టేషన్ లో దుర్ఘటన దేశ విచ్ఛిన్నకారుల కుట్ర అని ఆరోపించారు.

బాసర ఐఐటీ విద్యార్థుల కరెంట్ కట్ చేశారుజ‌ నీళ్లు బందు చేశారు. చదువుకునే పేదలను చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు తెలుసుకోవడానికి పోతుంటే భిక్నుర్ లో పోలీసులు ఆపేశారనీ సంజయ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భావ ప్రకటన స్వేచ్ఛను, కష్టాలు చెప్పుకొనే హక్కును కాలరాస్తున్నoదని ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement