Sunday, April 28, 2024

TS : కాంగ్రెస్ అర‌చేతిలో వైకుంఠాన్ని చూపిస్తుంది…. కేటీఆర్

యువతకు అరచేతిలో వైకుంఠం చూపించి తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ దుయ్యాబ‌ట్టారు. అధికారంలోకి వచ్చాక అసలు అటువంటి హామీ ఏమివ్వలేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట మార్చారని సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా ఆగ్రహం వ్యక్తంచేశారు.

కపట నీతికి మారుపేరు కాంగ్రెస్‌ పార్టీ అని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు.. ముఖ్యంగా తమ 120 రోజుల పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులతో సహా అందరికీ ద్రోహం చేయడం ప్రారంభించిందని విమర్శించారు. ప్రియాంక గాంధీ వంటి కాంగ్రెస్ అగ్రనాయకులు అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు రూ.4 వేల నిరుద్యోగ భృతి అందిస్తామని హామీ ఇచ్చారన్నారు.

- Advertisement -

‘ఫిబ్రవరి 1 నుంచి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అన్ని వార్తాపత్రికల మొదటి పేజీల్లో తమ జాబ్ క్యాలెండర్‌ గురించి ప్రకటనలు ఇచ్చింది. వాస్తవానికి బీఆర్ఎస్ హయాంలో భర్తీ చేసిన 30 వేల ఉద్యోగాలకు కేవలం నియామక పత్రాలను ఇచ్చి ఆ ఉద్యోగాలను కాంగ్రెస్‌ పార్టీ నిస్సిగ్గుగా తమ ఖాతాలో వేసుకుంటోంది. అన్ని పోటీ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తామన్న హామీపై యూ టర్న్ తీసుకుంటూ.. టెట్ పరీక్ష ఫీజును రూ.400 నుంచి రూ.2వేలకు (2 పేపర్లకు) పెంచింది. బల్మూరి వెంకట్ వంటి ఆ పార్టీ నాయకులను ఎన్నో కోర్టు కేసులు వేసి.. అనేక పోటీ పరీక్షలు రద్దవ్వడానికి కారణమయ్యారు. నిరుద్యోగుల ఉసురు పోసుకుని, ప్రతిఫలంగా వెంకట్ ఎమ్మెల్సీ పదవిని అందుకున్నాడు. కానీ.. ప్రభుత్వ ఉద్యోగ ఆశావహులను మాత్రం దిక్కుతోచని స్థితిలో వదిలేసింది కాంగ్రెస్. ఆ పార్టీ అసలు రంగు ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. తమని నట్టేట ముంచిన కాంగ్రెస్‌ పార్టీకి నిరుద్యోగ యువత గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చింది’ అంటూ ట్వీట్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement