Tuesday, May 7, 2024

Congress హయాంలోనే అభివృద్ది.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మొహమ్మద్ అలి షబ్బీర్

నిజామాబాద్ సిటీ నవంబర్ (ప్రభ న్యూస్)12: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి అభివృద్ధి చేశామని… బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి శూన్యమని నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మొహమ్మద్ అలి షబ్బీర్ అన్నారు.నిజామాబాద్ లో అభివృద్ధి చేశామని బిఆర్ఎస్ గొప్పలు చెప్పు కుంటుందన్నారు.ఆదివారం నిజామాబాద్ పట్టణంలోని బాబన్ షాపహాడి 11వ డివి జన్ లో మహబూబ్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మొహమ్మద్ అలి షబ్బీర్ మాట్లాడారు. నిజామాబాద్ నగరంలో బిఆర్ఎస్ ప్రభుత్వం కమిషన్లు వచ్చే పనులు చేశా రే…తప్ప ప్రజలకు ఉప యోగ పడే పనులు ఏమి చేయ లేద న్నారు .పది సంవత్సరాల్లో బాబన్ షా పహాడి కాలనీకి ఒక బ్రిడ్జి కట్టలేకపోయారన్నారు.

ఈ కార్యక్ర మంలో కేశవ వేణు.తాహేర్ బిన్ హందాన్, రత్నాకర్ నజీబ్. కరీం,నయీం షాహారాన్, ఇర్ఫాన్ అలి.రబ్బానీ. ముకీద్.షబ్బీర్,అర్షధ్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement