Sunday, May 19, 2024

BJP Campaign – ప్రజా ఆశీస్సులే నా బలం… బలగం…దన్పాల్

నిజామాబాద్ సిటీ, నవంబర్ (ప్రభ న్యూస్)12: ప్రజల ఆశీస్సులే నా బలం.. బలగమని బిజెపి అర్బన్ అభ్యర్థి దన్పాల్ సూర్య నారాయణ అన్నారు. ఆదివారం నిజామాబాద్ నగరంలోని 11 వ డివిజన్ నాగారం లోని శివాజీ విగ్రహం నుంచి బీజేపీ అభ్యర్థి దన్ పాల్ సూర్యనారాయణ ఇంటి ఇంటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్బంగా దన్ పాల్ సూర్య నారాయణ మాట్లాడుతూ నగ రంలో ఎన్నో దేవాలయాల కు దార్మికంగా అధ్యాత్మికంగా నా ట్రస్ట్ ద్వారా అభివృద్ధి కార్యక్ర మాలు చేస్తున్నానని అన్నారు. విద్య, వైద్యం కోసం ఏనాడూ నా దగ్గరకి వచ్చిన వాళ్లకు ఒట్టి చేతుల తో పంపలేదన్నారు. ఒక్క సారి అవకాశం ఇచ్చి నాకు ఓటేయాలని అభ్యర్థిం చారు. ప్రచారానికి వెళ్లిన ధన్ పాల్ కు డివిజన్లలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆడప డుచులు మంగళ హారతిల తో స్వాగతం పలికి పెద్ద ఎత్తున బిజెపికి మద్దతు పలికారు.

ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు పుట్ట వీరేందర్,11 వ డివిజన్ నాయకులు, సురేష్, గట్ల గంగాధర్, కళ్యాణ్, కిషోర్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ళ లక్ష్మినారాయణ,అసెంబ్లీ కన్వీనర్ పంచరెడ్డి లింగం,బొట్టు వెంకటేష్,హరీష్ రెడ్డి, బట్టీకారి ఆనంద్, శివనూరి భాస్కర్,బీజేపీ నాయకులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement