Sunday, April 28, 2024

Congress – కేటీఆర్ కు మైనార్టీ డిక్లరేషన్ పై మాట్లాడే హక్కు లేదు – అలీ షబ్బీర్

నిజామాబాద్ సిటీ, నవంబర్ (ప్రభ న్యూస్)11:ముస్లింలకు 12% రిజర్వేషన్ ఇస్తానని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాట తప్పాడని కాంగ్రెస్ నిజామాబాద్ అర్బన్ నియోజ కవర్గ అభ్యర్థి మాజీ మంత్రి మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నా రు. శనివారం నిజామాబాద్ నగరంలోని ఆటోనగర్ లోని కేకే గార్డెన్లో 12.13. డివిజన్ల నిర్వ హించిన ఆత్మీయ సమ్మేళ నంలో మాట్లాడుతూ మైనా రిటీ రిజర్వేషన్ల పై కేటీఆర్ అవగా హన లేకుండా మాట్లా డార న్నారు. కేటీఆర్ కు మైనార్టీ డిక్లరేషన్ పై మాట్లాడే హక్కు లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అన్నారు.కాంగ్రెస్ హయాంలో పేదలను ఆదుకునేందుకు రేషన్ షాపుల్లో 9 రకాల వస్తువులు అందించిన ఘనత కాంగ్రెస్ దేనిని పేర్కొన్నారు.

ఇప్పుడు బియ్యం తప్ప ఏమి రావడం లేదన్నారు.కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 4% వల్ల ఇప్పు డిప్పుడు పిల్లలు ఇంజనీర్లు డాక్టర్లు అవుతున్నారు దాన్ని కూడా రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నారనీ మండిపడ్డారు.బిఆర్ఎస్ బిజెపి ఎంఐఎం మూడు ఒకటేనని ప్రజలు ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి సమస్యలు పరిష్క రించుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కేశవ వేణు. తాహెర్ బిన్ హాందన్. జావిధ్ అక్రం. నజీబ్ అలీ. అర్షద్ ఖాన్. ముజాహిద్ ఖాన్.నయీమ్ షెహరాన్. తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement