Wednesday, May 8, 2024

లేఖలతో లాభం లేదు.. ప్రగతిభవన్‌కు వీహెచ్..

ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధికారిక నివాసం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హ‌నుమంత‌రావు వచ్చారు. అయితే, కేసీఆర్‌ను క‌లుద్దామంటే ఆయ‌న అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ‌లో కరోనాతో చనిపోయిన వారికి రెండు లక్షల రూపాయ‌ల చొప్పున‌ ఆర్థిక సాయం అందించాలని వీహెచ్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్ర‌జ‌ల‌ సమస్యలపై కేసీఆర్‌కు తాము ఎన్ని లేఖలు రాసినప్ప‌టికీ స్పందన రావ‌ట్లేద‌ని  మండిప‌డ్డారు. అందుకే తాను స్వయంగా లేఖ ఇచ్చేందుకు ప్రగతిభవన్ కు వచ్చానని వీహెచ్ తెలిపారు. ప్రజా సమస్యలపై తాను పోరాడుతూనే ఉంటాన‌ని వీహెచ్ స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి :ఆనందయ్య మందుపై నివేదిక రెడీ.. ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠ !

Advertisement

తాజా వార్తలు

Advertisement