Thursday, April 25, 2024

ప్రయాణికులు లేక 8 రైళ్ల రద్దు

కరోనా నేపథ్యంలో ప్రయాణికులు లేక 8 రైళ్లను రైల్వే రద్దు చేసింది. లాక్​ డౌన్​ తో ప్రయాణికుల సంఖ్య తగ్గినందున రైల్వే శాఖ కొన్ని మార్గాల్లో రైళ్లను తాత్కాలికంగా నిలిపివేసింది. ఇందులో 6 రైళ్లు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినవి కాగా.. మరో 2 దక్షిణ మధ్య రైల్వే జోన్‌ మీదుగా రాకపోకలు సాగించేవి ఉన్నాయి. విశాఖపట్టణం-కాచిగూడ (08561) రైలును జూన్ 1 నుంచి 10వ తేదీ వరకు, కాచిగూడ-విశాఖపట్టణం (08562) రైలును జూన్ 2 నుంచి 11 వరకు, విశాఖపట్టణం-కడప (07488) రైలును జూన్ 1-10, కడప-విశాఖపట్టణం (07487) రైలును జూన్ 2-11 మధ్య, విశాఖపట్టణం-లింగంపల్లి (02831) రైలును ఒకటో తేదీ నుంచి 10 మధ్య, లింగంపల్లి-విశాఖపట్టణం (02832) రైలును జూన్  2-11, పూణె-భువనేశ్వర్ (02881) రైలును జూన్ 3-10 మధ్య, భువనేశ్వర్-పూణె (02882) రైలును జూన్ 1-8 మధ్య రద్దు చేస్తున్నట్టు రైల్వే శాఖ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement