Friday, May 24, 2024

జనసంధ్రంగా మారిన కాంగ్రెస్ దండోరా సభ

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన దండోరా సభ జనసంధ్రంగా మారింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితోపాటు పార్టీ సీనియర్ నాయకులంతా ఇంద్రవెల్లికి చేరుకున్నారు. ఈ సభకు కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు దళితులు, ఆదివాసీలు, ప్రజలు భారీగా తరలివచ్చారు. దళిత గిరిజన దండోరా కార్యక్రమానికి అన్ని జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులను తరలి వచ్చారు.  కాంగ్రెస్‌ అధిష్టానం ఆదేశాల మేరకు నియోజకవర్గాల వారీగా జనసమీకరణ చేశారు. హైదరాబాద్ సహా పలు జిల్లాల నుంచి కాంగ్రెస్ శ్రేణులు సొంత వాహనాల్లో సభకు చేరుకున్నారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement