Saturday, April 27, 2024

పేదోళ్ల వైద్యానికి అండ‌గా సీఎంఆర్ఎఫ్ : ఎంపీ రంజిత్ రెడ్డి

పేదోళ్ల‌ వైద్యానికి కొండంత అండగా CMRF నిలుస్తుందని చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి.రంజిత్ రెడ్డి అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం, మాదాపూర్ డివిజన్ కు చెందిన సంతోష్ నాయక్ కు ఆక్సిడెంట్ కావడంతో అనారోగ్య సమస్య రాగా ఆ విషయాన్ని ఎంపీ రంజిత్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే ఎంపీ రంజిత్ రెడ్డి సానుకూలంగా స్పందించి 3 లక్షల రూపాయల CMRF చెక్ మంజూరు చేయించారు. మంజూరైన చెక్ ని వారి కుటుంబసభ్యులకు అందించారు. ఈ సందర్భంగా ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ దూరదృష్టితో వైద్య రంగంలో అనేక చర్యలు తీసుకుంటున్నారన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులు పేద ప్రజల అనారోగ్యానికి భరోసా ను ఇస్తున్నాయన్నారు. అడగగానే CMRF మంజూరు చేసిన సీఎం కేసీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement