Wednesday, April 24, 2024

Motor Car: ఎంజీ నుంచి కొత్త ఎలక్ట్రిక్ వెహిక‌ల్‌.. 15 లక్షల లోపే ధ‌ర‌..

ఆటోమొబైల్ సంస్థ ఎంజీ మోటార్స్​ ఇండియా (Morris Garages Motors India).. మరో విద్యుత్ కార్​ను (ఈవీ) విడుదల చేసేందుకు స‌న్నాహాలు చేస్తోంది. ఈసారి బడ్జెట్​ ధరలో కొత్త ఎలక్ట్రిక్ కారును తీసుకురావాలని ఎంజీ మోటార్స్ భావిస్తోంద‌ని ఆ సంస్థ ప్ర‌తినిధులు చెబుతున్నారు. నూతన ఎలక్ట్రిక్ కారు ధర రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల మధ్య (MG Budget Electrice car) ఉండ‌వ‌చ్చు. ఈ విషయాన్ని కంపెనీ స్వయంగా ప్రకటించడం గమనార్హం.

ప్రస్తుతం ఈ కంపెనీ గ్లోబల్ ప్లాట్​ఫామ్​ను ఆధారంగా చేసుకుని కొత్త కార్లను రిలీజ్ చేస్తోంది. భారత మార్కెట్​కు, దేశీయ వినియోగదారుల అభిరుచుల‌కు త‌గ్గ‌ట్టు వాటిల్లో మార్పులు చేసి.. కొత్త మోడల్స్‌ని రిలీజ్‌ చేస్తోంది. ఇప్పటికే కొత్త మోడల్​ కోసం ప్రక్రియ ప్రారంభమైనట్లు కంపెనీ తెలిపింది.

దేశీయ మార్కెట్లోకి ఎస్​యూవీ అస్టోర్​తో మంచి సేల్స్​ను సాధించింది ఎంజీ మోటార్స్. దీంతో జోరుమీదున్న ఈ కంపెనీ.. ప్రస్తుతం ఈవీలపై దృష్టిసారిస్తున్నట్లు తెలిపింది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సహకం (పీఎల్​ఐ) పథకం ద్వారా ప్రభుత్వ ప్రోత్సాహం కూడా లభిస్తున్న నేపథ్యంలో ఈవీలే ప్రధాన వృద్ధి మార్గంగా భావిస్తున్నట్లు వివరించింది. కొత్త ఈవీ వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి నాటికి విడుదల చేసే అవకాశమున్నట్లు వివరించింది.

ఆ కార్లకు పోటీగా..
దేశంలో దిగ్గజ వాహన తయారీ కంపెనీలుగా ఉన్న టాటా విద్యుత్ వాహనాలకు పోటీ ఇచ్చేందుకు ఎంజీ మోటార్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే బడ్జెట్​ ధరలో కొత్త కారును తీసుకురానుందని సమాచారం. ముఖ్యంగా టాటా నెక్సాన్​, టిగోర్ ఈవీలకు ఎంజీ మోటార్స్ మోడల్స్ గట్టి పోటీ ఇచ్చే అవకాశాలున్నాయని మార్కెట్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.

- Advertisement -

ప్రస్తుతం ఎంజీ ఎలక్ట్రిక్ కారు ధర ఎంతంటే..
ఎంజీ మోటార్స్ ప్రస్తుతం ఎస్​యూవీ ‘ZS EV’ ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లో విక్రయిస్తోంది. ఇది రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీని ధరను (ZS EV price) రూ.21 లక్షల నుంచి రూ.24.68 లక్షల మధ్య (ఎక్స్​ షోరూం) ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement